సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతూ ఉంటారు.అయితే ఈ క్రమంలోనే కొందరు నటీనటులు రెండు,మూడు సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు.
కానీ కొంతమంది కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా ఇచ్చిన కమిట్మెంట్ ను వెనక్కి తీసుకోవడం లేదంటే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.కానీ ఇంకొందరు కొంచెం లేటు అయినా పర్లేదు కానీ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇంకొందరు నటీనటులు అయితే వారి కారణంగా ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో వారు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ఉంటారు.ఇది తాజాగా ఒక నటి కూడా ఇదే విధంగా చేసింది.
ఆమె భర్త చనిపోయిన రెండు రోజులకే మళ్లీ షూటింగ్ లో యధావిధిగా పాల్గొంది.ఆయన నటి ఎవరో కాదు కేత్కి దేవ్.
ఈమె బాలీవుడ్ సీనియర్ నటుడు రసిక్ దేవ్ భార్య అన్న విషయం తెలిసిందే.రసిక్ దేవ్ కిడ్నీ ఫెయిల్యూర్తో ఇటీవల తాజాగా జులై 30 న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
అయితే గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రసిక్ దేవ్ ఇటీవల తుదిశ్వస విడిచారు.
అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే కేత్కి దేవ్ షూటింగ్లో పాల్గొంది.ఇదే విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
భర్త చనిపోయిన కూడా తాను ఎటువంటి బ్రేక్ తీసుకోలేదని ఆమె తెలిపింది.అయితే అందుకు గల కారణం కూడా వివరించింది.
ఆమె తన భర్త మరణించక ముందుగానే డేట్స్ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు ఆమె తెలిపింది.ఇకపోతే 1983లో రసిద్ దేవ్, కేత్కి ఇద్దరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.
వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు.