ఈ మధ్యకాలంలో కుర్ర హీరోయిన్స్ టాలీవుడ్ లోకి దూసుకొచ్చేస్తున్నారు.ఒక సినిమా రిలీజ్ కాకుండానే వరుసగా అవకాశాలు తెచ్చుకుంటున్నారు.
ఉప్పెన రిలీజ్ కి ముందే కన్నడ భామ కృతి శెట్టి ఏకంగా మూడు సినిమాలని లైన్ లో పెట్టేసింది.అలాగే ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో పరిచయం అవుతున్న ముంబై భామ మీనాక్షి చౌదరి మరో రెండు సినిమాలని లైన్ లో పెట్టేసింది.
అందులో ఒక సినిమాలో ఏకంగా మాస్ మహారాజ్ రవితేజతో కావడం విశేషం.ఇప్పుడు ఇదే దారిలో మరో హాట్ బ్యూటీ కూడా దూసుకొస్తుంది.
పూరీ జగన్నాథ్ కథతో అనిల్ దర్శకత్వంలో పూరీ తనయుడు హీరోగా రొమాంటిక్ అనే సినిమా తెరకెక్కింది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయిన ఎందుకనో రిలీజ్ ఆలస్యం అవుతుంది.
ఈ సినిమా ద్వారా ముంబై భామ కేతిక శర్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ భామ మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టేసింది.
అందులో నాగ శౌర్యకి జోడీగా అతని హోం బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది.ఇదిలా ఉంటే ఉప్పెన సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ అన్నపూర్ణతో పాటు మరో బడా నిర్మాతతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇప్పుడు ఓ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా నిర్మాత కేతిక శర్మని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఆ భామకి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిందని బోగట్టా.త్వరలో ఈ కాంబినేషన్ కి సంబందించిన సినిమా కూడా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరుపుకుంటుందని టాక్ వినిపిస్తుంది.