మంత్రులు రాజధాని విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతూ ఉంటే సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు.అసలు ఆయన వైఖరీ ఏంటీ అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేదా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు కేశినేని నాని అన్నారు.
నేడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న నాని వైకాపా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.అసలు వైకాపాకు పాలించడం చేతనవ్వడం లేదు అంటూ అవహేళన చేయడం జరిగింది.
తెలుగు దేశం పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని, కేసులకు భయపడి పార్టీని వీడవద్దని నాని విజ్ఞప్తి చేశాడు.తప్పకుండా తెలుగు దేశం పార్టీకి మంచి రోజులు వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశాడు.
ప్రతి ఒక్క కార్యకర్తకు సాయం చేసేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు అంతా కూడా సిద్దంగా ఉన్నారంటూ హామీ ఇచ్చారు.ప్రభుత్వ బెదిరింపులకు భయపకుండా ఇష్టానుసారంగా టీడీపీ నాయకులు ఉండాలని, పార్టీ మారాల్సిన అవసరం లేదు అంటూ సూచించారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్దిలో ముందుకు దూసుకు పోతే ఇప్పుడు వెనక్కు వెళ్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.