తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల సమస్య బాగా ముదురుతుంది.ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే కాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా తెలంగాణా మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపి కేశినేని నాని స్పందించారు.ముఖ్యమంత్రులు కే.సి.ఆర్, జగన్ ఇద్దరు తోడు దొంగలని అన్నారు.రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వాటర్ వార్ పెద్ద డ్రామా అని ఆయన తేల్చి చెప్పారు.ఏపీ ప్రజలను జగన్, తెలంగాణా ప్రజలను కే.సి.ఆర్ పిచ్చోళ్లని చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు కే.సి.ఆర్ తో కలిసి వైఎస్ జగన్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
ఎన్నికల తర్వాత ఇద్దరు సీఎం లు కౌగిలించుకుని బొకేలు ఇచ్చుకునే రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావించానని.వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇరువురూ నాటకాలు ఆడుతున్నారని అర్ధమవుతుందని కేశినేని అన్నారు. జగన్ డ్రామాలు ఆడుతుంటే అక్కడ హైదరాబాద్ లో ఆయన చెల్లెలు షర్మిల డ్రామాలు మొదలు పెట్టారని అన్నారు.వీళ్లు చేసే డ్రామాలు జనాలు గమనించట్లేని పిచ్చోళ్లు కాదని అన్నారు.80 శాతం అభివృద్ధి చెందిన అమరావతి జగన్ వదిలేశారని ఇప్పుడు కృష్ణా నది కరకట్టని అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని మండిపడ్డారు కేశి నేని నాని.