ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా జరిగిన సంగతి తెలిసిందే.పలు అంశాలపై అధికార,ప్రతిపక్షాలు ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకుంటూ సభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో మంగళవారం జరిగిన ముగింపు సమావేశాల్లో చోటుచేసుకున్న ఒక అంశం పై టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా పోస్ట్ చేసారు.సమావేశాల సమయం లో ఒకానొక సందర్భంలో ఏపీ సీఎం జగన్ పడిపడి నవ్విన వీడియో ను నాని పోస్ట్ చేస్తూ సంచలన కామెంట్లు చేశారు.
సభలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం లో టీడీపీ చేసిన అభివృద్ది పై మాట్లాడుతున్న సమయంలో జిల్లా లో లిఫ్ట్ ఇరిగేషన్ చేశామని స్పీకర్ కు తెలిపారు.అయితే స్పీకర్ కల్పించుకొని ఏంటండీ అని ప్రశ్నించడం తో ఒక్కసారిగా బాబు తడబడ్డారు.
దానితో ఒక్కసారిగా సభలో ఉన్న జగన్ పడి పడి నవ్విన జగన్ చాలాసేపు అలానే నవ్వుతూ ఉన్నారు.
అయితే ఈ వీడియో ను పోస్ట్ చేసిన నాని జగన్ పై సంచలన విమర్శలు చేశారు.‘పిచ్చి వాడి చేతిలో రాయి జగన్ చేతిలో రాజధాని రెండిటికీ ఏమి తేడా లేదు.ఎటు విసురుతారో ఎక్కడ పడుతుందో దేవుడికి కూడా తెలియదు’ అని అంటూ తన పేస్ బుక్ ఖాతా లో పోస్ట్ చేశారు.
కేశినేని నాని ఇలా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టడం ఇదే తొలిసారి ఏమి కాదు గతంలో కూడా ఎన్నో పోస్ట్ లు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.