ఆ ఒక్కటి అడక్కు అంటున్న ప్రభుత్వం, కార్మికులకు అదే కావాలట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె తీవ్రతరం అవుతోంది.ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వం కూడా కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది.

 Keshavarao Spoke With Rtc Workers Demands-TeluguStop.com

తాజాగా కేశవరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంకు మాత్రం ప్రభుత్వం సిద్దంగా లేదని, ఇతర అన్ని డిమాండ్లకు తాము ఒకే చెప్తామంటూ ఈ సందర్బంగా కేశవరావు అన్నాడు.

మరో వైపు ఆర్టీసీ కార్మికులు కూడా ఈ విషయమై స్పందించారు.నేడు కార్మి సంఘాల జేఏసీ నాయకులు గవర్నర్‌తో భేటీ అయ్యారు.ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించారు.అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఒక వైపు కార్మికులు డ్యూటీలో జాయిన్‌ అయితే చర్చలకు సిద్దం అంటూ ప్రకటించగా, మరో వైపు కార్మికులు మాత్రం అదే డిమాండ్‌తో ఉన్నారు.ఇక ప్రభుత్వం ప్రత్యామ్యాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube