టీడీపీ అంటే ఒక బలమైన పార్టీ అని చెప్పాలి.ముఖ్యంగా ప్రజల్లో వైసీపీ కంటే కూడా ఎప్పటి నుంచో ఉన్న పార్టీ.
ఇక చంద్రబాబు నాయుడు అంటే ఒక రాజకీయ చాణక్యుడు.రాజకీయాల్లో అపర మేథావిగాఉన్నారు.
అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో చూస్తున్నాం.ఒకప్పుడు తిరుగులేని అధికారంలో ఉన్న చంద్రబాబు ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా ఇమేజ్ కోల్పోయారు.
ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయింది.దీంతో ఆ తర్వాత వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు.
ఇక రాజకీయాల పరంగా తన కొడుకునన్న ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్న చంద్రబాబుకు ఆది నుంచే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.ఆయన కొడుకు లోకేష్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో చంద్రబాబుకు అతి కోలుకోలేని దెబ్బ అయింది.
ఎందుకంటే పార్టీకి భావి అధినేతగా భావిస్తున్న తరుణంలో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోవడం పెద్ద షాక్.అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్ చేయట్లేదు.
కేవలం టూర్లు, సభలుఉన్నప్పుడు మాత్రమే వస్తున్నారు తప్ప నిత్యం ప్రజల నడుమ ఉండట్లేదు.
ఇక లోకేష్ కూడా అంతే.ఏదైనా పరామర్శలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి వెళ్తున్నారు.ఇద్దరూ హైదరాబాద్ వేదికగానే రాజకీయం నడిపిస్తున్నారు తప్ప ప్రజల నడుమ ఉండట్లేదు.
అదే వారిని ప్రజలకు దూరం చేస్తోంది.పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ విమర్శిస్తోంది.
ఇలంటి ముద్రను పోగొట్టుకోకుంటే అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చేప్రమాదం కూడా ఉంది.కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్ మేల్కొని ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంటే రాబోయే ఎన్నికల్లో వారికి తిరిగి అధికారం చేకూర్చే అవకాశం ఉంటుందనిచెబుతున్నారు.
ఇదే విషయాన్ని తమ్ముళ్లు కూడా పలుమార్లు సూచిస్తున్నారంట.