సుప్రీంకోర్టు స్వలింగ సంబంధాలను చట్టబద్ధం చేసిన తర్వాత ఇండియాలో ఇలాంటి జంటలు నేరుగా బయటకు వచ్చి తన భావ ప్రకటన స్వేచ్ఛను చూపిస్తున్నారు.సమాజానికి భయపడి తమ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదంటూ నేరుగా తమ రిలేషన్ షిప్ ని, తమ జెండర్ ని పరిచయం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో మరో అడుగు ముందుకేసి స్వలింగ వివాహాలు చేసుకున్న వారు కూడా ఉన్నారు.వీటికి చట్టబద్ధ ఉండడంతో సాంప్రదాయ వివాహ పద్ధతిలోనే వీరు కూడా తమ వివాహాలు చేసుకుంటున్నారు.
తాజాగా ఓ గే కపుల్స్ కి సంబంధించిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కేరళకు చెందిన ఆంటోనీ చుళ్ళికల్, అబ్దుల్ రహీం అని ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తమ వివాహం ద్వారా తమలాంటి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని భావించారు.దానికోసం తాజాగా వీరు తమ ఫ్రీ వెడ్డింగ్ ఫోటో చుట్టూ ప్లాన్ చేశారు.
అందులో తమ పెంపుడు జంతువులతో కలిపి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఒకరిమీద ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునే విధంగా ఫోటోలు తీసుకున్నారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి వివాహాల తరహాలోనే స్వలింగ వివాహాలు కూడా సాధారణమైనవి అని, ఒకరిమీద ఒకరు అమితమైన ప్రేమలో ఉన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గు పడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు వీరి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్ గా మారడంతో కొంతమంది పాజిటివ్గా కామెంట్ లు పెడుతుంటే కొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.ఏది ఏమైనా ఈ ఫోటోషూట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.