ఈ మధ్యకాలంలో జెండర్ ఇష్యూని అందరూ లైట్ తీసుకుంటున్నారు.ఒకే జెండర్ ఉన్నవాళ్ళు కూడా పెళ్లి చేసుకొని కలిసి ఉండొచ్చని తీర్పు చెప్పిన తర్వాత చాలా మంది బయటకి వస్తూ ఆ రకమైన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
అదే సమయంలో ట్రాన్స్ జెండర్స్ కూడా బయటి ప్రపంచంలోకి వస్తూ ఆత్మన్యూనతా వదిలేసి వారు కోరుకున్న రంగాలలో రాణిస్తున్నారు.అలాగే వారిని పెళ్లి చేసుకోవడానికి కొంత మంది మగాళ్ళు ఆసక్తి చూపిస్తూ, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.
ఇప్పుడు కేరళలో అలాంటి వివాహం ఒకటి జరిగింది.ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ట్రాన్స్ జెండర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
కేరళకు చెందిన హైదిసాదియా అబ్బాయిగా పుట్టినా ఎదుగుతున్న క్రమంలో జెండర్ ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు అయితే అందరి కుటుంబాలలో మాదిరే ఆమె ఇంట్లో కూడా దీనికి ఒప్పుకోలేదు.దీంతో బయటకి వచ్చి బ్రతుకుతున్న ఆమె ఓ టీవీ చానల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది.
హైదీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి సంబంధాలు చూస్తున్న క్రమంలో ఆమెకి అధర్వ మోహన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పరిచయం అయ్యాడు.ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకున్నారు.
తరువాత అధ్వర్వ తనని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకి విషయం చెప్పాడు.వారు ఒప్పుకోవడంతో బంధువుల సమక్షంలో వివాహంతో ఒకటయ్యారు.
ఇప్పుడు వీరి పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.