నూజివీడు, మసునూరు మండలల్లో రైతు భరోసా కేంద్రాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పరిశీలించిన కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పి.ప్రసాద్.
కేరళ మంత్రి వెంట కేరళ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించారు మంత్రి మరియు కేరళ అధికారులు.
కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు వ్యవసాయ అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్న కేరళ మంత్రి, అధికారులు.
సేంద్రియ సాగు, రైతు భరోసా కేంద్రాలు యొక్క ఉపయోగాలు,వ్యవసాయ సాగులో మెలకువలు చక్కగా ఉన్నాయని కితాబు ఇచ్చిన కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.