ఇటీవల వర్షాలు భారీగా పడుతున్నాయి.భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.
మన దేశంలో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.దీని వల్ల కొన్ని లోటత్తు ప్రాంతాల్లో వరదలు రావడంతో ప్రజలు ఈ వర్షాలు, వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వరదల కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
ప్రెసెంట్ కేరళలో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారి పోయింది.
వర్షాలు, వరదలతో పాటు కొండ చర్యలు కూడా విరిగి పడుతుండడం తో కేరళ మొత్తం నానా బీభత్సంగా ఉంది.ముఖ్యంగా కేరళ లోని కొట్టాయంఇడుక్కి జిల్లాల్లో వరదల వల్ల కొద చరియలు ఇరిగి పడుతూ ఇల్లు కూడా ధ్వంసం అవుతున్నాయి.
ఇక ఈ వరదల కారణంగా కేరళలో ఏకంగా ఒక ఇల్లు వరదల్లో కొట్టుకు పోయింది.
కొట్టాయం జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల ఆదివారం సాయంత్రం ఒక ఇల్లు ఆ వరదల్లో అమాంతం కొట్టుకు పోయిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి భారీ వర్షాలు కారణంగా వరద ఉదృతి పెరిగింది.ఆ నదికి భారీగా వరద నీరు చేరడంతో నది ఒడ్డున ఉన్న ఇల్లు ఆ వరద ఉధృతికి కొట్టుకు పోయింది.
అందరు చూస్తుండగానే ఆ ఇల్లు ఒక్కసారిగా కొట్టుకు పోవడంతో ఆశ్చర్య పోయారు.అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.ఇలా వరద ఉదృతి ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రజలను ముందుగానే కాళీ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది.ఈ ఇల్లు కొట్టుకు పోతున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.