ఈ భారత ఎన్నారై సుడి మాములుగా లేదుగా...!!!!

దేశం కాని దేశంలో తమ లక్కు ఎలా ఉందొ పరీక్షించుకుందామని అనుకున్న ఓ ఎన్నారై లాటరీ టిక్కెట్టు కొన్నాడు.అయితే ఆ తరువాత ఆ విషయాన్ని మర్చి పోయాడు.

 Kerala Man Wins 2 7 Million In Raffle Draw In Uae-TeluguStop.com

తీరా చూస్తే అతడు కొన్న టిక్కెట్టుకే లక్కు వరించింది.వస్తుందో లేదో అనుకున్న అతడి కోరిక నెరవేరింది.

దాదాపు 18 కోట్ల రూపాయలు తలుపు తట్టాయి.ఇంకేముందు ఇప్పుడు అతడు కోటీశ్వరుడు అయ్యాడు.

ఒక్క సారి ఆ ఎన్నారై కి ఈ లక్కు ఎలా చిక్కిందనే వివరాలలోకి వెళ్తే.

ఈ భారత ఎన్నారై సుడి మాములుగా ల

షార్జా లో డిజైనర్ గా పని చేస్తున్న కేరళాకి చెందిన సంజయ్‌నాథ్‌ అనే ఎన్నారై , తన స్నేహితులతో కలిసి మే నెలలో లాటరీ టిక్కెట్టు కొన్నాడు.ఆ తరువాత టిక్కెట్టు ఫలితాలు పట్టించుకోలేదు.అయితే తన స్నేహితులు ఆ లిస్టు లో ఎవరెవరు గెలుపొందారో చూసుకోగా తన స్నేహితుడి పేరు ఉండటం చూసి ఉబ్బితబ్బిబ్బైయ్యారు.వెంటనే ఈ విషయాన్ని చెప్పడానికి అతడికి ఫోన్ చేయగా.

ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని వచ్చింది.అందరూ అతడికి మెసేజ్ లు చేశారు.

చాలా సేపటికి అతడు ఫోన్ ఆన్ చేయగానే వరుసగా వచ్చిన మెసేజ్ లు చూసి షాక్ అయ్యాడు.నువ్వు 18 కోట్లు గెలుచుకున్నావ్ అని చూడగానే ఒక్క సారిగా అతడి ఎగిరి గంతేశాడు.

అయితే ఈ పెద్ద మొత్తం సామాజిక సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తానని తెలిపారు.తన సన్నిహితులతో ఈ సతోషం పంచుకుంటానని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube