ఆస్తికోసం ఏ విషయంలోనైనా ఏ సంబంధం లేకుండా దేనికైనా సిద్ధంగా ఉంటారు.అలాగే ఇక్కడ ఆస్తి మీద ఉన్న ఆశతో తనకంటే వయసులో పెద్ద ఆవిడను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు.
చివరకు పోలీస్ స్టేషన్ లో జైలులో కూర్చున్నాడు.అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం.
కేరళలోని కరక్కోణం ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసే ఓ యువకుడు అరుణ్ కుమార్.ఇతని వయస్సు 28 ఏళ్లు.ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేసే 51ఏళ్ళ మహిళ శాఖా కుమారి.అరుణ్ కుమార్ తల్లికి స్నేహితురాలైన శాఖా కుమారి అరుణ్ కుమార్ ల మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది.
అలా కొన్నేళ్ళు ప్రేమలో ఉన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.దీంతో ఈ ఏడాది అక్టోబర్ 19న కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
కాగా వయసులో తనకంటే పెద్దదైన మహిళను పెళ్లి చేసుకున్నందుకు సమాజం ఏమనుకుంటుందో అని ఎవరికి తెలియకుండా రహస్యంగా ఈ విషయాన్ని దాచాడు.కానీ శాఖా కుమారి పెళ్లి చేసుకున్న సంతోషంలో తమ బంధువులకు ఫోటోలను షేర్ చేసింది.తన భర్త ఎన్నోసార్లు బయటకు పెళ్లి ఫోటోలు పంపవద్దని తెలుపగా.ఆమె సంతోషం కోసం ఫోటోలను షేర్ చేసింది.దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న తన భర్త అరుణ్ ఆమె పై గొడవకు దిగాడు.దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది.
అరుణ్ కోపం తట్టుకోలేక కరెంట్ షాక్ ఇచ్చి తనని చంపాడు.దీంతో ఆమె కరెంట్ షాక్ గురై చనిపోయిందని కథలు అల్లగా.
పోలీసుల సమక్షంలో అసలు నిజం బయటపడింది.వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జైల్లో పెట్టారు.
ఇదిలా ఉంటే వయసులో పెద్దావిడను పెళ్లి చేసుకోవడానికి ఓ కారణం ఉంది.అతడు ఆమెను నిజంగా ప్రేమించలేదు.
కేవలం ఆవిడ దగ్గర ఉన్న ఆస్తి ని చూసి ప్రేమ అనే పేరుతో పెళ్లి చేసుకున్నాడు.ఆమెకు ఎకరాలకు పైగా భూమి, బ్యాంకులో క్యాష్, ఇన్సూరెన్స్ కంపెనీ లో నెలకు లక్ష రూపాయల జీతం తో ఉద్యోగం పైగా ఒంటరి మహిళ.
ఇదంతా ఆస్తిని దక్కించుకోవాలని ఆశతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు.ఆ పెళ్లిలో తనకు లక్ష రూపాయలు, కారు బహుమతిగా అందించారు.
కానీ ఆమె తన ఒంటరితనానికి తోడుగా ఉంటాడని అనుకుంది.కానీ చివరకు ఆస్తి కోసం ఆమె ప్రాణాలనే తీసేసాడు.