కవల పిల్లలు అనగానే మనకు ఇద్దరు పిల్లలు ఠక్కున గుర్తుకు వస్తారు.చాలా అరుదుగా ముగ్గురు కూడా కవల పిల్లలుగా పుడతారు.
కొన్ని చోట్ల ముగ్గురు మాత్రమే కాకుండా నలుగురు కవల పిల్లలు కూడా పుడతారు.కాని ప్రపంచంలో ఇప్పటి వరకు అయిదుగురు కవల పిల్లలు పుట్టిన దాఖలాలు అతి తక్కువగా ఉంటాయి.
దాదాపు 20 ఏళ్ల క్రితం నలుగురు కాదు ఏకంగా అయిదుగురు కవల పిల్లలు మన దేశంలో అది కూడా మన పన్కన ఉండే కేరళ రాష్ట్రంలో జన్మించారు.
సాదారణంగా కవల పిల్లలు అంటే ఇద్దరు కూడా బరువు తక్కువగా పుడతారు.సాదారణంగా పుట్టే పిల్లల కంటే కవల పిల్లలు తక్కువ బరువుతో పుడతారు.అలాంటిది అయిదుగురు కవల పిల్లలు అంటే వారి బరువు ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు.
అయిదుగురు కూడా కనీసం ముప్పావు కేజీ కూడా పుట్టలేదు.మన పిడికిలి బిగిస్తే ఎంత పరిమాణం ఉంటుందో అంతే పరిమాణంలో పుట్టారు.
కేరళకు చెందిన రమాదేవి కడుపులో ఈ అయిదుగురు కవల పిల్లలు జన్మించారు.నలుగురు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి.
ఆ నలుగురు జీవించడం కష్టమే అంటూ డాక్టర్లు చెప్పారు.కాని ఆ తల్లి మాత్రం తన బిడ్డలను కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.
అయిదుగు కవల పిల్లల్లో అయిదుగురు కూడా ఆరోగ్యంగా జీవించారు.అప్పట్లో సంచలనం రేపిన ఈ కవల పిల్లలు ఇప్పుడు మరోసారి జనాల దృష్టి ఆకర్షిస్తున్నారు.నలుగురు అమ్మాయిల పెళ్లి చేయడం తన వల్ల కాదని భయపడ్డ ఆ పిల్లల తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.కాని రమాదేవి మాత్రం కష్టపడి ప్రభుత్వ సాయంతో ఒక బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది.
వారికి ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమాల అంటూ పేర్లు పెట్టింది.ప్రస్తుతం నలుగురు అమ్మాయిలు కూడా పెళ్లీడుకు వచ్చారు.
వారిని గ్రాడ్యుయేషన్ వరకు చదివించిన రమాదేవి ఇప్పుడు వారికి పెళ్లి చేయాలని చూస్తోంది.నలుగురి పెళ్లి ఒకే సమయానికి ఒకే వేదికపై పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది.అందుకోసం ఏర్పాట్లు చేస్తోంది.వీరిని చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.ప్రపంచంలో నలుగురి కవలల పెళ్లిలు ఒకేసారి అవ్వడం చాలా రేర్గా జరుగుతుంది.అందుకే ఇదో విచిత్రమైన విభిన్నమైన పెళ్లి అని, ఇలాంటి పెళ్లి ప్రపంచంలో ఎక్కడ చూసి ఉండరు అంటూ జనాలు చెబుతున్నారు.