మామిడి పండ్ల తినడానికి ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మామిడి పండ్ల కాలం ఎప్పుడు వస్తుందా అని అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.
రైతులు కూడా మామిడి పండ్ల కాలం గురించి ఎంతగానో ఎదురుచూస్తారు.ఎందుకంటే ఆ మామిడి పండ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఆశతో ఎదురు చూపులు చూస్తారు.
మామిడి పండ్లు అమ్మితే డబ్బులు వస్తాయనే విషయం మన అందరికి తెలిసిందే.మరి అదే విధంగా మామిడి ఆకులు అమ్మినగాని డబ్బులు సంపాదించవచ్చని మీకు తెలుసా.
ఒక్క డబ్బే కాదండోయ్.మామిడి ఆకులు అమ్మితే ఒక కంపెనీలో షేర్లు కూడా పొందవచ్చు తెలుసా? వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నాగాని ఇది నిజం.
అసలు వివరాల్లోకి వెళితే.కేరళ రాష్ట్రంలో ఈ మామిడి ఆకుల వ్యాపారం జరుగుతుంది.అక్కడ ఎండు మామిడి ఆకులతో కేరళ రైతులు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు.మామిడి పండ్లు విషయానికి వస్తే మహా అయితే కిలో 200 నుంచి 500 రూపాయల వరకు ఉంటాయి కదా.అలాగే ఈ ఎండిన మామిడి ఆకుల ధర కూడా కేజీకి 150 వరకు పలుకుతుంది.కేరళలోని కన్నూర్, కాసర్గోడ్ లో రైతులంతా ఎండిన మామిడి ఆకులతో అదనపు ఆదాయం లభిస్తుంది.ఓ కంపెనీ ఇచ్చిన ఆఫర్తో మామిడి ఆకుల వ్యాపారం మొదలైంది.‘ఈనో వెల్నెస్ నికా’ అనే పళ్లపొడి కంపెనీ ఈ ఎండు మామిడి ఆకులను కొనుగోలు చేస్తోంది.
ఆర్గానిక్ పళ్ల పొడికి ఇటీవలే పేటెంట్ హక్కులు పొందిన ఈ సంస్థ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనుంది.అందుకోసం ఇప్పటినుంచే పళ్ళపొడికి అవసరమైన ముడి సరకు కొనుగోలుపై దృష్టిపెట్టింది.ఈ క్రమంలోనే కన్నూర్, కాసర్గోడ్ లోని రైతుల దగ్గర నుండి ఎండిన మామిడి ఆకులు సేకరిస్తోంది.అయితే ఈ ఎండు మామిడి ఆకులు మంచి శుభ్రమైన వాతావరణంలో సహజసిద్ధంగా రాలినవయి ఉండాలి.
అంతేకాదు పూర్తిగా ఎండకు ఎండినవై ఉండాలి.అలా ఎండిన మామిడి ఆకులను ఆ కంపనీ వాళ్ళకి ఇస్తే ఒక్కో కిలోకు 150 రూపాయలు దాక ఇస్తారట.
ఒకవేళ వాళ్ళకి గాని డబ్బులు వద్దు అనుకుంటే ప్రతి రెండు కిలోలకు ఆ సంస్థలో ఒక షేరు కూడా వాళ్లకు కేటాయిస్తున్నారు.