పౌరసత్వ సవరణ బిల్లుపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈశాన్య రాష్ట్రాలతో పాటు, ఢిల్లీ, సౌత్ లో కేరళలో ఈ బిల్లుపై పెద్ద ఎత్తున ప్రజల నుంచి, మైనార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
అయితే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు విషయంలో వెనక్కి తగ్గకున్న ప్రజలు మాత్రం తమ నిరసనని వినూత్న రీతిలో వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో పౌరసత్వ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా వినూత్న రీతిలో వీడియోలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉంటే.
మరో వైపు విద్యార్ధులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
తాజాగా కొత్తగా పెళ్లి చేసుకుంటున్న జంటలు తమ పెళ్లి వేడుకలో వినూత్న రీతిలో పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన తెలియజేశారు.
కేరళ రాష్ట్రంలో పెళ్లి పీటల మీద కొత్త జంట నో ఎన్నార్సీ, నో సీఏఏ అని ప్లకార్డులు పట్టుకున్నారు.ఈ ఫోటోలను కేరళకు చెందిన మరో జంట కూడా ఎన్నార్సీకి వ్యతిరేకంగా వినూత్న నిరసనను తెలిపింది.
అలాగే మరో జంట పెళ్లి దుస్తులు ధరించి చేతుల్లో విత్డ్రా క్యాబ్ అంటూ పోస్టర్ను చూపిస్తూ నిరసనను తెలిపారు.వీటిని ఇండియన్స్ ఎగినెస్ట్ ఎన్నార్సీ అని హ్యాస్ ట్యాగ్ యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.మొత్తానికి ప్రజలు ఈ పురసత్వ సవరణ, ఎన్నార్సీ బిల్లుల మీద తమదైన శైలిలో నిరసనలు తెలియజేస్తూ వీటికి తాము వ్యతిరేకం అని చెబుతున్నారు.