కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ కె సుధాకరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో… విజయన్… గతంలో ఇదే సుధాకరన్… తన పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేశారు.
ఈ విషయమై ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోలేదని.సుధాకరన్ స్నేహితుడు ఒకరు గతంలో తన ఇంటికి వచ్చేవాడని, ఆ టైంలో తన పిల్లలను పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో కిడ్నాప్ చేయడానికి సుధాకరన్…పెద్ద స్కెచ్ వేశాడు అని సదరు వ్యక్తి తనతో తెలపడం జరిగిందని పేర్కొన్నారు.ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అన్న దాని విషయంలో పినరయి విజయన్ చెప్పలేదు.అంతే కాకుండా ఇప్పటి వరకు ఈ విషయం తన భార్యకు కూడా తెలియదని ఆమె భయపడుతుంధేమో అన్న ఉద్దేశంతో అప్పట్లో తెలపటం జరగలేదని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళ కాంగ్రెస్ కే సుధాకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.