రెండవ పెళ్లి అంటే ఇతర దేశాల్లో చాలా కామన్గానే చూస్తారు.కాని ఇండియా వంటి సాంప్రదాయబద్దమైన దేశంలో మాత్రం రెండవ పెళ్లిని నేరంగా ఘోరంగా చూస్తారు.
మొదటి భాగస్వామికి విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకున్నా కూడా ఏదో తప్పు చేసినట్లుగానే భావిస్తూ ఉంటారు.అందుకే రెండవ పెళ్లి అనగానే అంతా కూడా ఆమెకు అంత అవసరమా, అతడికి ఇప్పుడు రెండవ పెళ్లి అవసరమా అన్నట్లుగా ప్రశ్నిస్తూ ఉన్నారు.
తాజాగా తన తల్లి రెండవ పెళ్లి చేసుకున్న సందర్బంగా ఒక కుర్రాడు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళకు చెందిన శ్రీధర్ తన తల్లి రెండవ పెళ్లి చేసుకున్న విషయంను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.
గోకుల్ తల్లి భర్త నుండి విడిపోయి ఒంటరి జీవితంను గడుపుతోంది.ఆమె భర్తతో కలిసి ఉన్న సందర్బంలో చాలా ఇబ్బందులు పడింది.భర్త పెట్టే వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.కాని కొడుకు భవిష్యత్తు కోసం ఆమె ఆలోచించి ఆ బాధలను భరించింది.
కొడుకు కాస్త పెద్ద వాడు అయిన నేపథ్యంలో భర్త నుండి విడాకులు తీసుకుని ఒంటరి జీవితంను ఆరంభించింది.తాజాగా గోకుల్ శ్రీధర్ పెద్ద వాడు అయ్యాడు.
అమ్మకు పెళ్లి చేయాలని ఆలోచించాడు.ఆమె కూడా అందుకు ఒప్పుకుంది.
అమ్మ పెళ్లి చేసిన తర్వాత గోకుల్ శ్రీధర్ ఒక ఉత్తరంను రాశాడు.అందులో.అమ్మ నీవు రెండవ పెళ్లి చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.ఎంతో చెప్పాలని ఉంది, కాని ఏం చెప్పలేక పోతున్నాను.అందుకే ఈ ఉత్తరం ద్వారా నా మనసులని విషయాలను నీకు తెలియజేస్తున్నాను.నా చిన్నతనంలో నిన్ను నాన్న కొడుతుంటే నీ కాలు విరిగి పోయి జీవచ్చవంలా కొన్ని గంటల పాటు అలాగే పడి ఉన్న సమయంలో నేను ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు.
అప్పుడు జాలి పడటం తప్ప నేనేం చేయలేక పోయాను.నాన్న నిన్ను కొట్టిన ప్రతి సారి కూడా నా భవిష్యత్తును ఆలోచించి నువ్వు ఆయనతోనే ఉన్నావు.
నా కోసం నీ జీవితంను త్యాగం చేశావు.నీ జీవంలో ఇప్పటి వరకు నా కోసం త్యాగం చేసింది చాలమ్మా.ఇకపై అయినా నీవు కొత్త జీవితాన్ని ప్రారంభించి కోల్పోయిన జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నానమ్మ అంటూ పేర్కొన్నాడు.గోకుల్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.