లాక్ డౌన్ అనేది అందరికి ఒకేలా ఉండదు.అందరూ మిడిల్ క్లాస్.
హై క్లాస్ ఉండరు కదా! కష్టాలు ఉన్నవారు ఉంటారు.లేని వారు ఉంటారు.
కట్టే కష్టపడితే కానీ పొట్ట గడవదు.అలాంటి వాళ్ళు ఈ లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తారు.
ఇంట్లో ఉంటే పూట గడవదు.బయటకు వెళ్తే కరోనా భయం.ఇంకా అలాంటి వాళ్ళకు ఒక పూట అయినా తిండి దొరకడమే గగనం.
ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రతిఒక్కరి కంట కన్నీళ్లు పెట్టించే ఘటన కెన్యాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కెన్యా దేశానికి చెందిన ఓ మహిళకు ఏకంగా 8 మంది పిల్లలు ఉన్నారు.
ఇంకా ఆమె భర్త గత ఏడాది ఓ దొంగ చేతిలో హత్యకు గురయ్యాడు.దీంతో ఆ మహిళా పెద్ద ఇళ్లలో పని చేసి ఆ 8 మంది పిల్లలను పోషించేది.
అయితే ఇప్పుడు లాక్ డౌన్ తో ఎక్కడ పని లేదు.ఇంట్లో చూస్తే ఏమి లేవు.పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు.ఎం చెయ్యాలో తోచని ఆ మహిళా ఓ గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో రాళ్లు పెట్టి ఉడకబెట్టింది.
అలా అయినా పిల్లలు అమ్మ వంట చేస్తుంది అని ఏడుపు ఆపుతారు అని అనుకుంది.కానీ పిల్లలు ఇంకా ఎక్కువ ఏడవడం మొదలు పెట్టారు.
దీంతో ఆ పిల్లల ఏడుపు విన్న పక్కింటి వ్యక్తి వచ్చి చూడగా అక్కడ పరిస్థితి అర్థం అయ్యింది.దీంతో ఆ దారుణ పరిస్థిని స్థానిక మీడియా ముందు తీసుకొచ్చాడు.
ఇంకా అంతే.ఆ పరిస్థితి చుసిన కెన్యా ప్రజలు ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు.
ఇలా ఆమెను ఆ దేశ ప్రజలు ఆదుకున్నరు.చూశారు కదా! ఈ తల్లి బిడ్డలకు అయితే ప్రస్తుతం కడుపు నిండా అన్నం దొరికింది.
కానీ ఇలాంటి కుటుంబాలు ఎన్నో మన చుట్టుపక్కల ఉంటాయి.వారందిరికి ఈ కష్టకాలంలో కాస్త అయినా సహాయం చేద్దాం.
కొందరి కడుపులు అయినా నింపుదాం.