వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇదిలా ఉంటే ఈ రాష్ట్రంలో బిజెపికి పెద్దగా ఓటు బ్యాంకు లేదు.
మరోపక్క పట్టు కలిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం గ్రూపు రాజకీయాలు తారా స్థాయిలో ఉన్నాయి.మాజీ సీఎం అమరేందర్ సింగ్.
కి.నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు ఉండటంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి.ఇటువంటి తరుణంలో.పంజాబ్ రాష్ట్రంలో సత్తా చాటాలని “ఆమ్ ఆద్మీ పార్టీ” అధినేత కేజ్రీవాల్ డిసైడ్ అయ్యారట.పంజాబీ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని.ఇప్పటి నుండే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలో కేజ్రీవాల్ పర్యటించనున్నారు.బుధవారం నాడు లూధియానాలో పర్యటించి అక్కడ వ్యాపారులతో.కేజ్రీవాల్ సమావేశం అవుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.అంత మాత్రమే కాక ఇప్పటికే పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీలో… గొడవలు మరింతగా ఉండటంతో.
పంజాబ్ రాష్ట్రంలో ఆమాద్మీ పార్టీ క్యాడర్…ఫుల్ జోష్ లో ఉంది.దీంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.
రెండు రోజుల పర్యటన లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్.పలు కీలక హామీలు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న టాక్.