ప్రపంచంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న సమయంలో ప్రజలకు సేవలందించిన వ్యక్తులకు కరోనా వారియర్లు అని పేరు పెట్టారు.కానీ కరోనా తగ్గుముఖం పట్టగానే వీరి ఊసే మరచిపోయారు.
అప్పుడు దేవుళ్లుగా కనిపించిన కరోనా వారియర్లు ప్రస్తుతం కష్టాలు ఎదుర్కొంటున్నారు.
వీరిని ప్రభుత్వాలైతే పట్టించుకోవడం లేదన్న విషయం ప్రచారం జరుగుతున్నట్లు తెలిసిందే.
ఈ క్రమంలో కరోనా వారియర్ల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం బాసటగా నిలిచింది.విధి నిర్వహణలో వైరస్ బారిన పడి మృతి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నిషన్లు, వైద్య సిబ్బంది కుటుంబాలకు రూ.1కోటి ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా ల్యాబ్ టెక్నిషియన్ రాకేష్ జైన్ ఫ్యామిలీకి శనివారం రూ.కోటి చెక్కు అందజేశారు అధికారులు.
ఇక మృతుడు రాకేష్ జైన్ ఢిల్లీలోని హిందురావ్ హాస్పిటల్లో కరోనా వారియర్గా విధులు నిర్వర్తిస్తూ వైరస్ బారిన పడి తనువు చాలించాడు.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరపురావడం లేదు.ఈ మహమ్మారి నుంచి బాధితులను రక్షించే క్రమంలో క్వారంటైన్లో ఉన్న రోగులకు చికిత్స అందిస్తూ, వైరస్ బారిన పడి చాలా మంది కరోనా వారియర్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.