దేశ రాజధాని హస్తిన అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తించాయి.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న ఆప్కు మద్య పోటీ హోరా హోరీగా సాగింది.
ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ నాయకులు ఆప్పై చేసిన విమర్శలు మరియు దాడులను ఆ పార్టీ నాయకులు తిప్పి కొట్టారు.అయిదు సంవత్సరాలు చేసిన పరిపాలన చూసి ఓట్లు వేయాలంటూ ఓటర్లను ఆప్ నాయకులు కోరారు.
విద్యావంతులు అయిన హస్తిన ఓటర్లు మళ్లీ ఆమ్ ఆద్మీకే ఓటు వేశారు.వరుసగా మూడవ సారి కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అవుతున్నాడు.నేడు వెలువడుతున్న ఫలితా సరళి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్లుగానే ఉన్నాయి.పూర్తి మెజార్టీతో చీపురు పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం ఖాయంగా మారిపోయింది.
కేజ్రీవాల్ అయితేనే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మంచి పరిపాలన అందిస్తాడని ఓటర్లు భావించినట్లుగా తెలుస్తోంది.పూర్తి పలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి.
కాని ఆప్ ఆధిపత్యం మాత్రం కంటిన్యూ అవ్వడం ఖాయం.