మళయాళ భామ కీర్తి సురేష్ ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తూ తన సత్తా చాటుతుండగా అది చాలదు అన్నట్టు ఇప్పుడు ప్రొడక్షన్ ని కూడా మొదలు పెట్టాలని అనుకుంటుందట.కీర్తి సురేష్ సొంత బ్యానర్ స్టార్ట్ చేస్తుందని తెలుస్తుంది.
తన తండ్రి సురేష్ కుమార్ అంతకుముందు నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు.కానీ ఇప్పుడు ఆయన కూడా సినిమాలు నిర్మించడం మానేశారు.
కానీ కీర్తి మళ్లీ తన సొంత బ్యానర్ తో సినిమా లు చేయాలని ఫిక్స్ అయ్యింది.కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్, స్మాల్ బడ్జెట్ మూవీస్ తో కీర్తి తన నిర్మాణ సంస్థ నడిపించాలని చూస్తుంది.
హీరోయిన్స్ డైరక్టర్స్ గా మారిన సందర్భాలు ఉన్నాయి.ఈమధ్య కథానాయికలు నిర్మాతలుగా మారినట్టుగా కూడా తెలుసు.
వారి దారిలోనే ఇప్పుడు కీర్తి సురేష్ కూడా నిర్మాతగా మారి సత్తా చాటాలని చూస్తుంది.ఒక హీరోయిన్ గా సినిమా నిర్మాణ బాధ్యత కొద్దిగా కష్టమే అయినా తనకు నచ్చిన పని చేయడంలో ఎప్పుడూ వెనకాడని కీర్తి సురేష్ నిర్మాతగా కూడా తన అభిరుచికి తగిన సినిమాలు చేయాలని చూస్తుంది.
మరి కీర్తి సురేష్ సొంత బ్యానర్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.