మహానటి తర్వాత కీర్తి సురేష్ తన ట్రాక్ పూర్తిగా మార్చేసింది.సినిమా సెలక్షన్ విషయంలో కంటెంట్ కి ప్రాధాన్యత ఇస్తుంది.
తమిళంలో మహానటి తర్వాత విజయ్, విశాల్ తో కమర్షియల్ సినిమాలు చేసిన తెలుగు సినిమాల విషయానికి వచ్చే సరికి మాత్రం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుంది.మహానటి తర్వాత కీర్తి సురేష్ నుంచి ఇప్పటి వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు.
డబ్బింగ్ రూపంలోనే అన్ని సినిమాలు వచ్చాయి.ఇప్పుడు కూడా మరో సరి డబ్బింగ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తుంది.
అయితే అది డిజిటల్ ప్లాట్ ఫాంలో.కీర్తి సురేష్ లీడ్ రోల్ లో కార్తిక్ సుబ్బరాజు ప్రొడక్షన్ లో పెంగ్విన్ అనే సినిమా తెరకెక్కింది.
ఇందులో కీర్తి సురేష్ గర్భవతి పాత్రలో కనిపిస్తుంది.ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకున్న లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిపోయింది.
లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో విడుదలకు సిద్ధంగా వున్న సినిమాలు కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే.దీంతో థియేటర్ల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే, ఇక్కడ సినిమా నిర్మాణం కోసం తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, నిండా మునిగిపోతామని భావించిన కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన పెంగ్విన్ చిత్రం ఆన్ లైన్ లో ముందుగా విడుదల కావడానికి ఒప్పందం జరిగిపోయింది.ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇది విడుదల కానుంది.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 8న సినిమాకు సంబంధించిన టీజర్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ రిలీజ్ చేయనుంది.ఇక ఈశ్వర్ కార్తీక్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.