టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కీర్తి సురేష్.కేవలం నాలుగు సినిమాలతో జాతీ ఉత్తమ నటి అనిపించుకున్న కీర్తి సురేష్ బొద్దుగా తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువ అయ్యింది.
కాస్తా బొద్దుగా కనిపించే కీర్తి సురేష్ ని తెలుగు ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు.దీంతో ఆమె ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకపోయినా స్టార్ హీరోయిన్ గా రిసీవ్ చేసుకుంటున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ తన కొత్త సినిమాల కోసం బొద్దుగుమ్మా లుక్ నుంచి జీరో సైజ్ కి వచ్చేసింది.జీరో సైజ్ లో కీర్తి సురేష్ ని తెలుగు అభిమానులు అస్సలు చూడలేకపోయారు.
ఆ ప్రభావం మిస్ ఇండియా సినిమా మీద కూడా పడింది.ఈ సినిమాలో మొహంలో ఎలాంటి కల లేకుండా కీర్తి సురేష్ చూడటానికి పేలవంగా అనిపించింది. ఈ ప్రభావం సినిమా రిజల్ట్ మీద కూడా పడింది.అయితే నెక్స్ట్ ఆమె చేతిలో వరుసగా అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.అందులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా సర్కారు వారి పాట కూడా ఉంది.అయితే మహేష్ అభిమానులు సైతం బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ ని ఇష్టపడటం వలన ఈ జీరో సైజ్ కి కనెక్ట్ కాలేకపోతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని నేరుగా కీర్తితోనే పంచుకున్నారు.మరల మునుపటి లుక్ లోకి ఎప్పుడు వస్తారు అని ఓ అభిమాని కీర్తి సురేష్ ని డైరెక్ట్ గా అడిగేశాడు.
దానికి ఆమె కూడా నవ్వుతూనే కమింగ్ సూన్ అని చెప్పింది.దీనిని బట్టి కీర్తి మరల మహానటి లుక్ లోనే మహేష్ సినిమాలో కనిపించబోతుందని తెలుస్తుంది.