ప్రభాస్ 21వ సినిమాల ఇటీవలే ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.మహా నటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన చర్చలు చాలా జోరుగా సాగుతున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతం అందరిలో మెదులుతున్న ప్రశ్న.ప్రస్తుతానికి సినిమా హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించలేదు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి ఫేం కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.నాగ్ అశ్విన్ కు కీర్తి సురేష్ తో మహానటి సమయంలో మంచి బాండింగ్ ఏర్పడింది.
ఆకారణంగానే ప్రభాస్ కు జోడిగా ఆమెను నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.వైజయంతి మూవీస్ బ్యానర్ ఈ సినిమాతో 50 ఏళ్లకు చేరబోతుంది.ఆ కారణంగానే సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.ప్రభాస్ కు జోడిగా కీర్తి నటిస్తే ఖచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ అవ్వడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
మరి ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందో చూడాలి.