కీర్తిసురేశ్ ఈమె పేరులోనే కీర్తి ఉందనుకుంటే ఇప్పుడు తన ప్రతిభతోనూ ఆ పేరును సార్ధకం చేసుకుంటోంది.నిజం చెప్పాలంటే ఆమె తల్లి మేనక సాధించలేని కలలను ఈ అమ్మడు నెరవేర్చుతోందని చెప్పవచ్చు.
మేనక రజనీకాంత్కు జంటగా నెట్రకన్ చిత్రంలో నటించినా, ఆ తరువాత తమిళంలో పెద్దగా పేరు తెచ్చే చిత్రాల్లో నటించలేదు.
మలయాళీ చిత్ర నిర్మాత సురేశ్ను పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు.అలా ఆమె వారసురాలిగా పరిచయమైన కీర్తీసురేశ్ నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం నిరాశపడడంతో ఈ అమ్మడికి నటిగా పెద్దగా భవిష్యత్తు ఉండదేమో అనే టాక్ అప్పట్లో వినిపించింది.అలాంటిది రజనీమురుగన్, రెమో వంటి చిత్రాలు వరుసగా విజయం సాధించడం, మహానటి చిత్రంలో సావిత్రిని మరిపించడం వంటివి కీర్తీసురేశ్ స్థాయిని పెంచేశాయి.
తాజాగా ‘నెం.1 యారి’ కార్యక్రమంలో ‘నేను లోకల్’ స్టార్స్ కీర్తి సురేష్, నాని పాల్గొన్నారు.ఈ సందర్బంగా రానా ఈ ఇద్దరి నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టారు.హీరోయిన్ కీర్తి సురేష్ తన లవ్ లెటర్ గురించి వెల్లడించారు.మీకు ఎదురైనా క్రేజీ ఫ్యాన్ ఇన్సిడెంట్ ని వివరించండి చేయండి అని రానా అడిగిన ప్రశ్న కి కీర్తి సమాధానమిస్తూ
“జ్యువలరీ షో రూమ్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాన్ ఒక బుక్ ఇచ్చాడు, ఆ బుక్ లో నా పిక్స్ చాలా ఉన్నాయ్, ఆ బుక్ లో ఒక లెటర్ ఉంది, ప్రాపర్ లవ్ ప్రపోసల్ లెటర్ అది.ఆ లెటర్ లో ఆ అబ్బాయి ఫోటో, డీటెయిల్స్ అన్ని ఉన్నాయ్.నేను ఆ లెటర్ ని ఇంకా నా దెగ్గరే సేఫ్ గా ఉంచుకున్న.ఎందుకంటె నాకు కాలేజీ డేస్ లో కూడా ఎవరు ప్రొపొసె చేయలేదు, లవ్ లెటర్ ఇవ్వలేదు” అని తెలిపింది.