టాలీవుడ్ అందగత్తె కీర్తి సురేష్.తన నటనతో మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.తన నటన పట్ల ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది.తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం వంటి సినిమాల్లో నటించింది.ఫ్యాషన్ డిజైనింగ్ లో మోడల్ గా చేసిన కీర్తి సురేష్ తరువాత సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.
తొలిసారిగా మలయాళం సినిమాల్లో బాలనటిగా 2000 లో పైలెట్స్ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది.ఆ తరువాత తమిళంలో నటించగా.2016లో నేను శైలజ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇక తాను నటించిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కీర్తి.
ఇదిలా ఉంటే నిజ జీవితంలో తన మనసును గెలుచుకున్న కీర్తి సురేష్.ప్రస్తుతం అభిమానుల నోటిలో బంగారం అనిపించుకుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ అభిమాని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది.దీంతో తను కీర్తి సురేష్ నుంచి విషెస్ కోరింది.ఇక ట్విట్టర్ లో కీర్తి సురేష్ ను ట్యాగ్ చేస్తూ.మేడమ్ నేను మీ అభిమానిని.ఈరోజు నేను పుట్టిన రోజు జరుపుకుంటున్నాను.మీ నుండి నాకు విషెస్ అందివ్వాలి అంటూ ట్వీట్ చేసింది.
దీంతో కీర్తి సురేష్ అభిమాని అడిగిన వెంటనే పుట్టినరోజు విషెస్ తెలిపింది.దీంతో అభిమాని ఆనందానికి అంతు లేకుండా పోయింది.
ఈ పోస్ట్ కు సంబంధించిన ఫోటోను ఆ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజనులు కీర్తి మనసు బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు సినిమాలో సర్కారు వారి పాట లో హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా హీరో నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తుంది.
ఇదే కాకుండా రజినీకాంత్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రీమేక్ సినిమాలో నటించనుంది.