టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించుకునేందుకు రెడీ అవుతోంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను గీతా గోవిందం లాంటి సినిమాను అందించిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక ఈ సినిమా షూటింగ్ను జనవరి నుండి నిర్విరామంగా జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కీర్తి సురేష్ ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే ఈ సినిమాలో తనది సాలిడ్ పాత్ర అని, ఆమె పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతున్నట్లు కీర్తి సురేష్ తెలిపింది.మహేష్ లాంటి స్టార్ హీరోతో నటించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని కీర్తి తన సోషల్ మీడియా వేదికలో ఆనందాన్ని పంచుకుంది.
కాగా ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్లో మనకు కనిపిస్తాడని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ-లుక్ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది.ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుండగా, ఆర్ధిక నేరాల బ్యాక్డ్రాప్తో ఈ కథను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఈ సినిమాతో తనకు మరోసారి మంచి గుర్తింపు దక్కుతుందని కీర్తి సురేష్ భావిస్తోంది.మరి ఈ సినిమాలో అమ్మడికి ఎలాంటి గుర్తింపు వస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
కాగా కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం మిస్ ఇండియా నేడు ఓటీటీలో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్ను సాధించింది.