అందాల భామ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.మహానటి చిత్రంతో అదిరిపోయే క్రేజ్ను తెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా మారిపోయింది.
ఇప్పటికే పెంగ్విన్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న కీర్తి సురేష్, ప్రస్తుతం మరో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను లైన్లో పెట్టింది.ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్నాయి.
ఇందులో కీర్తి సురేష్ నటిస్తున్న మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు.ఈ రెండు సినిమాలు కూడా రెండు విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్నాయి.
కాగా ఇందులో గుడ్ లక్ సఖీ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ కథతో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకల్లో సినిమాపై మంచి బజ్ను క్రియేట్ చేసింది.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ మేరకు ఈ చిత్రానికి గుమ్మడికాయను కొట్టారు చిత్ర యూనిట్.
త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది ఈ సినిమా.
అయితే ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోండటంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కీర్తి నటించిన పెంగ్విన్ చిత్రం కూడా ఓటీటీలో రిలీజ్ కావడంతో, ఇప్పుడు గుడ్ లక్ సఖీ చిత్రాన్ని కూడా అదే బాటలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.