గత సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.
ఇక రెండవ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే జరగాల్సి ఉండగా కరోనా కారణంగా హైదరాబాద్ లోనే చేయాలనీ అనుకున్నారు.
అనుకున్నట్టుగానే ఉగాది రోజు హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.పరుశురాం ఈ సినిమాను సామజిక అంశంతో తెరకెక్కిస్తున్నాడు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.
అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ఈ సినిమా చేస్తున్న రోల్ ఇదే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.ఈ సినిమాలో కీర్తి మహేష్ బాబుకు సబార్డ్ నెట్ గా కనిపిస్తుందని ఈమె పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు ఈమె స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుందట.
ఇందులో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ గా కనిపిస్తే అదే బ్యాంక్ లో ఉద్యోగినిగా కీర్తి కనిపించబోతుందట.
ఈ సినిమాలో నటనతో పాటు అందానికి కూడా పెద్ద పీట వేస్తూ కీర్తి రోల్ ను చక్కగా రూపొందిస్తున్నాడట డైరెక్టర్.
ఇక ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.