సౌత్ ఇండియాలో ప్రస్తుతం కీర్తి సురేష్ హవా ఒక రేంజ్ లో కొనసాగుతుంది.ఓ వైపు హీరోలతో జత కడుతూనే మరో వైపు ఫీమేల్ సెంట్రిక్ కథలతో దూసుకుపోతుంది.
అయితే మహానటి తర్వాత కీర్తి సురేష్ చేసిన ఫీమేల్ సెంట్రిక్ కథలు ఏవీ కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి.మహానటి సినిమా హిట్ తర్వాత తమిళంలో వరుసగా విక్రమ్, విజయ్, విశాల్ తో సినిమాలు చేసింది.
వీటిలో రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఆ తరువాత ఫీమేల్ సెంట్రిక్ కథలని చేసుకుంటూ వచ్చింది.
తమిళంలో పెంగ్విన్, తెలుగులో మిస్ ఇండియా సినిమాలు చేసింది.ఈ రెండు సినిమాలు ఊహించని రీతిలో డిజాస్టర్ అయ్యాయి.
మహానటితో కీర్తి సురేష్ కి వచ్చిన ఫేమ్ ని ఈ రెండు సినిమాలు చెడగొట్టాయనే అభిప్రాయం వినిపిస్తుంది.ప్రస్తుతం మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీ గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాతో బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు.
స్వతహాగాగా తెలుగువాడైన నగేష్ కుకునూర్ హిందీ సినిమాలతోనే తన ప్రయాణం స్టార్ట్ చేశాడు.ఎప్పటి నుంచి తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నా అది గుడ్ లక్ సఖి సినిమాతో సెట్ అయ్యింది.ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది.
దీని తరువాత సర్కారువారి పాట సెట్స్ పై ఉంది.అలాగే రజినీకాంత్ తో చేస్తున్న సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
అలాగే రంగ్ దే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.తమిళంలో శానికాయుధం సినిమా షూటింగ్ దశలో ఉంది.
ప్రస్తుతం ఆమె చేతిలోనే ఐదు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.మరో మూడు సినిమాల వరకు చర్చల దశలో ఉన్నాయి.
ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ రెమ్యునరేషన్ విషయంలో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉండటంతో ఇపుడు ఆమె కొత్త సినిమాల కోసం ఏకంగా రెండు కోట్లు తీసుకుంటుంది.
అయితే కరోనా కారణంగా 50 లక్షలు తగ్గించుకొని కోటిన్నర చేసింది.ఫస్ట్ రెమ్యునరేషన్ ఒకే అనుకోని వెళ్లిన వాళ్ళకి కథ చెప్పడానికి సమయం ఇస్తుందనే టాక్ నడుస్తుంది.