తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం రోజురోజుకీ ఊపందుకుంటోంది.రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించి హరితహారం రాష్ట్రంగా తయారుచేసేందుకు టిఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరి నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖుల పాల్గొనడమే కాకుండా తోటివారిని కూడా భాగస్వామిని కూడా చేస్తున్నారు.
అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించినటువంటి మహానటి చిత్రంలో అలనాటి విలక్షణ నటి, అందాల తార సావిత్రి పాత్ర పోషించిన హీరోయిన్ కీర్తి సురేష్ స్వీకరించి సూరారం నగరంలోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని కోరారు.
అంతేగాక తనలాగే ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు,తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది.తెలుగులో లో ఒక ముఖ్య దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న టువంటి రంగ్ దే అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతేగాక గుడ్ లక్, సఖి, మిస్ ఇండియా, పెంగ్విన్, అనే తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.