సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్న అందాల భామ కీర్తి సురేష్.మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ గెలుచుకొని సత్తా చాటిన కీర్తి సురేష్ తరువాత రెండేళ్లు టాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
అయితే ఆమె నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది ఓటీటీ ద్వారా రిలీజ్ అయినా ఒకటి కూడా హిట్ కాలేదు.ప్రస్తుతం రంగ్ దే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది.
అలాగే గుడ్ లక్ సఖీ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
వీటి తర్వాత కీర్తి ఖాతాలో మరో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి.అందులో రజినికాంత్ కూతురుగా నటిస్తున్న అన్నత్తై ఒకటి కాగా, సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటిస్తున్న సర్కారు వారి పాట మరో సినిమా.
వీటితో పాటు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉన్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ మరో యంగ్ హీరోతో జత కట్టబోతుంది.అజ్ఞాతవాసితో పవన్ కళ్యాణ్ పక్కన నటించి దెబ్బ తిన్న కీర్తి ఈ సారి ఎలా అయిన హిట్ కొట్టాలని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఆడిపాడటానికి రెడీ అయ్యింది.దేవాకట్టా సినిమా తర్వాత తేజ్ చేయబోయే పీరియాడికల్ మూవీలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలుస్తుంది.
కార్తిక్ దండు ఈ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు.తేజ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖరున ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు