కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది.
ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అంతేకాదు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసింది.
ఇక కీర్తి ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేస్తుంది.
ఈ కారకంలోనే కీర్తి నటన పరంగా బాగుంటే చాలు ఎలాంటి పాత్రలను అయినా చేయడానికి ఓకే చెప్పేస్తుంది.దీంతో కీర్తికి చెల్లెలిపాత్రలు కూడా వస్తున్నాయి.ఒకపక్క హీరోయిన్ గా నటిస్తూనే మరొక పక్క ఇలా ఇంపార్టెంట్ రోల్స్ వస్తే వాటిని కూడా వాదులు కోవడం లేదు.కీర్తి సురేష్ నటించిన పెద్దన్న సినిమా ఈ మధ్యనే విడుదల అయ్యిన విషయం తెలిసిందే.
రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి సోదరి పాత్రలో కనిపించింది.అందుకోసం పారితోషికం బాగా అందుకుందని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 150 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఇందులో కీర్తి తీసుకున్న పారితోషికం పై చర్చ జరుగుతుంది.
ఈమె ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుందట.
సమాచారం ప్రకారం పెద్దన్న సినిమాలో రజనీకాంత్ సోదరి పాత్ర కోసం ఏకంగా 2 కోట్ల పారితోషికం అందుకుందట.ఈమె పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉండడం వల్ల అంత రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇక ఇప్పటి వరకు కీర్తి అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే నంటూ సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రెసెంట్ కీర్తి ‘సర్కారు వారి పాట‘ సినిమాలో మహేష్ బాబు పక్కన నటిస్తుంది.దీంతో పాటు నాని దసరా సినిమాలో, చిరు భోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లెలి పాత్రలో, ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.