యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది.వెంకీ కుడుముల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రావడంతో ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన నెక్ట్స్ మూవీని కూడా ఇప్పటికే ప్రారంభించాడు.
రంగ్దే అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాలో మహానటి బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్ చూడముచ్చటగా ఉండటంతో నితిన్ నెక్ట్స్ మూవీలో కూడా ఈమెనే హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది.కృష్ణచైతన్య డైరెక్షన్లో తెరకెక్కనున్న పవర్పేట సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఏలూరు అమ్మాయిగా కీర్తి సురేష్ నటిస్తుందని, గోదావరి యాసలో అదిరిపోయే డైలాగులు ఆమెను హైలైట్ చేస్తాయని తెలుస్తోంది.ఈ సినిమాలోని పాత్ర ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.
మొత్తానికి వరుసగా రెండు సినిమాల్లో నితిన్ను లైన్లో పెట్టిన ఈ బ్యూటీ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.