కీర్తి సురేష్ అనగానే అందరికీ మహానటిగా గుర్తొస్తుంది.మహానటి సినిమా ద్వారా అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ మధ్యే నితిన్ తో రంగ్ దే సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాలో కామెడీతో ఈ అమ్మడు బాగానే ఆకట్టుకుంది.
ప్రస్తుతం కీర్తి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమా చేస్తుంది.
పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.అంతేకాదు తమిళంలో రజనీకాంత్ అన్నత్తై సినిమాలో కూడా నటిస్తుంది.
ఈ సినిమాను మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కనుక హిట్ అయితే ఏ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం.
ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటో కూడా సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఈ ఫోటో చుసిన అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఈమె లుక్ చూసి ఆశ్చర్య పోతున్నారు.
కీర్తి సురేష్ ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ట్రెడిషనల్ గా మాత్రమే కనిపించేది.
కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రోజురోజుకూ చిక్కిపోతూ కనిపిస్తుంది.ఇప్పుడిప్పుడే గ్లామర్ పాత్రలలో కనిపించడానికి రెడీ అవుతున్న కీర్తి డైటింగ్ పేరుతో ఉన్న అందాన్ని పోగొట్టుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా షేర్ చేసిన ఈ పిక్ చుస్తే అర్ధం అవుతుంది కీర్తి సురేష్ ఎంత సన్నగా మారిపోయిందో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఫోటో చుసిన అభిమానులు ఏంటి ఈ కొత్త అవతారం అంటూ కీర్తిని ప్రశ్నిస్తున్నారు.ఆమె ఆ ఫొటోలో వేసుకున్న డ్రెస్ లో మరింత సన్నగా కనిపిస్తుంది.
బొద్దుగా ఉన్న కిర్తినే బాగుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఆ అవతారం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.