ఓటీటీకే ఓటేసిన మిస్ ఇండియా..?

అందాల భామ కీర్తి సురేష్ నటించిన రీసెంట్ మూవీ పెంగ్విన్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇది యావరేజ్ మూవీగా నిలిచింది.

 Keerthy Suresh Miss India To Release On Ott, Keerthy Suresh, Miss India, Good Lu-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు కీర్తి సురేష్ చూస్తోంది.ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉంది.

కాగా ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక ఈ సినిమానే కాకుండా కీర్తి సురేష్ తన నెక్ట్స్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా రిలీజ్‌కు రెడీ చేసింది.

కాగా ఈ సినిమాను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమాను కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కించగా, ఇందులో కీర్తి సురేష్ యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ సినిమాతోనైనా కీర్తి సురేష్ ఓటీటీలో అదిరిపోయే సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

కాగా టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ ఎంపికైన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube