అందాల భామ కీర్తి సురేష్ నటించిన రీసెంట్ మూవీ పెంగ్విన్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇది యావరేజ్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు కీర్తి సురేష్ చూస్తోంది.ఈ క్రమంలోనే కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ ఇప్పటికే రిలీజ్కు రెడీగా ఉంది.
కాగా ఈ సినిమా టీజర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇక ఈ సినిమానే కాకుండా కీర్తి సురేష్ తన నెక్ట్స్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా రిలీజ్కు రెడీ చేసింది.
కాగా ఈ సినిమాను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాత మహేష్ కోనేరు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాను కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కించగా, ఇందులో కీర్తి సురేష్ యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి ఈ సినిమాతోనైనా కీర్తి సురేష్ ఓటీటీలో అదిరిపోయే సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
కాగా టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపికైన సంగతి తెలిసిందే.