ఇళయదళపతి విజయ్ తో దిల్ రాజు పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.
ప్రస్తుతం దిలీప్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన స్టొరీ నేరేషన్ వంశీ పైడిపల్లి, విజయ్ కి చేశారు.
ఆయన కూడా స్క్రిప్ట్ ఫైనల్ చేసేశారు.దీంతో దిల్ రాజు టీమ్ ఇప్పుడు కంప్లీట్ స్క్రిప్ట్ వర్క్ మీద ఉంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ బ్యూటీ సర్కార్ సినిమాలు విజయ్ కి జోడీగా నటించింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారువారి పాట మూవీలో నటిస్తుంది.
ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే అవుతుంది.
మొత్తానికి టాలీవుడ్ అభినవ మహానటి స్టార్ హీరోయిన్ గా మారి వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలని అంది పుచ్చుకుంటూ తన హవాని కొనసాగిస్తుంది.
మహేష్ సినిమాతో పాటు రజినీకాంత్ అన్నాత్తై మూవీలో అతనికి కూతురుగా కీర్తి సురేష్ కనిపించనుంది.ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.దీంతో పాటు తెలుగు, తమిళ్ లో ఓ నాలుగు సినిమాల వరకు చర్చల దశలో ఉన్నాయి.అలాగే నగేష్ కుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గుడ్ లక్ సఖి మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది.
అలాగే తమిళ్ లో సెల్వ రాఘవన్ తో కలిసి సానికాయుధం అనే మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది.మలయాళంలో మోహన్ లాల్ పీరియాడిక్ మూవీ మరక్కర్ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది.