దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను యంగ్ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం ఫాలో అవుతారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల ద్వారా తనకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారని సమాచారం.చాలామంది సినిమా హీరోయిన్లు స్టార్ డమ్ వచ్చిన తర్వాత సైడ్ బిజినెస్ ద్వారా సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోయిన్లు తమ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు.అయితే కీర్తి సురేష్ కూడా భూమిత్ర అనే పేరుతో సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ ను లాంచ్ చేశారని తెలుస్తోంది.
బిజినెస్ రంగంలో అడుగుపెట్టాలని కీర్తి సురేష్ తీసుకున్న నిర్ణయానికి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఉందని తెలుస్తోంది.ఇతర దేశాల భాగస్వాములతో కలిసి కీర్తి సురేష్ ఎంటర్ ప్రెన్యూర్ గా మారుతుండటం గమనార్హం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో కీర్తి సురేష్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం సర్కారు వారి పాట, అన్నాత్తే, భోళా శంకర్ సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తున్నారు.ఈ మూవీ కోసం కీర్తి సురేష్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.గతంలో బొద్దుగా కనిపించిన కీర్తి ప్రస్తుతం స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్నారు.
వ్యాపారవేత్తగా కీర్తి సురేష్ రాణిస్తారో లేదో చూడాల్సి ఉంది.సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటిస్తున్నారు.
కీర్తి సురేష్ కొత్త కథలు కూడా వింటున్నారని త్వరలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.