కీర్తి సురేష్.ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది.
హీరోయిన్ మేనక, మలయాళ నిర్మాత సురేష్ కుమార్ ముద్దుల కూతురు కీర్తి.తన సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటి.
ఫస్ట్ సినిమాలో హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.
మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా తోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి.అయితే ఆ తర్వాత నుండి ఈమె ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది.ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఈమెను ఆదుకుంది అనే చెప్పాలి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు కీర్తి సురేష్ మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది.
ఇది ఇలా ఉండగా ఇప్పుడిప్పుడే ఈమె మహానటి ఇమేజ్ నుండి బయటకు వచ్చి అందాల ఆరబోతపై ద్రుష్టి పెట్టింది.ఈమె సర్కారులో కూడా బాగానే అందాల ప్రదర్శన చేసి ముందు ముందు గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధం అనే సంకేతాన్ని ఇచ్చింది.
ఇక తాజాగా ఈమె షేర్ చేసిన పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఈమె స్టైలిష్ లుక్ గురించి ప్రేక్షకులు తెగ చర్చించు కుంటున్నారు.ఈమె మరీ గ్లామర్ చూపించకుండానే.ప్రేక్షకులను మెప్పిస్తుంది.ఈమె స్టైలిష్ లుక్ చుసిన ఫ్యాన్స్ స్వీట్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రెసెంట్ కీర్తి భోళా శంకర్ లో నటిస్తుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.