మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.మే 12వ తారీకు న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సర్కార్ వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వాయిదా వేస్తూ వచ్చారు.
ఆచార్య ప్రమోషన్స్ మరియు సర్కార్ వారి పాట యొక్క ప్రమోషన్ ఒకే సారి జరిగితే క్లాష్ అయ్యి రెండు సినిమాలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేశారు.అందుకే ఆచార్య సినిమా విడుదల అయ్యే అంత వరకు కూడా ఈ సినిమా కు సంబంధించిన ఎలాంటి హడావుడి చేయ వద్దని మహేష్ బాబు స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులతో తెలియజేసినట్లు సమాచారం అందుతోంది.
ఎందుకంటే మహేష్బాబుకి మరియు ఆచార్య చిత్ర దర్శకుడు కొరటాల శివ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆ సన్నిహిత సంబంధాల కారణంగా ఆచార్య సినిమాకు ఎలాంటి ఇబ్బంది కలగ కూడదనే ఉద్దేశంతో మహేష్ బాబు తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాడట.
మహేష్ బాబు మరో నాలుగు రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నబోతున్నాడు.అయితే ఈలోపు మహేష్ బాబు కంటే ముందు చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరిని మీడియా వర్గాల వారు ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమయ్యారు.
మహేష్ బాబు రాక ముందే సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇంటర్వ్యూ కి వచ్చాడు.ఇక తాజాగా కీర్తి సురేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని ప్రముఖ మీడియా సంస్థ యొక్క సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఆ ఒక్క ఇంటర్వ్యూ లో కాకుండా ఇంకా పలు ఇంటర్వ్యూలలో కూడా కీర్తి సురేష్ పాల్గొంటుంది.మళ్ళీ సినిమా విడుదలకు మూడు నాలుగు రోజుల ముందు మహేష్బాబుతో కలిసి ఇంటర్వ్యూ లో ఆమె పాల్గొనే అవకాశం ఉంది.
మొత్తానికి కీర్తి సురేష్ ముందే తన పని పూర్తి చేసుకుంటుంది.సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మహేష్ బాబు తో కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం సాధ్యం కాదని ముందే ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది