ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమిళంలో ఈమె రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.
ఇదే సమయంలో మహేష్బాబు తెలుగులో చేయబోతున్న సర్కారు వారి పాట చిత్రంలో కూడా నటించేందుకు సిద్దం అవుతోంది.ఇంతకు ముందే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన చిత్రంలో నటించింది.
ఇలా ఎంతో మంది స్టార్ హీరోలో నటించిన, నటించబోతున్న కీర్తి సురేష్ త్వరలో గోపీచంద్కు జోడీగా నటించబోతుంది అంటూ వస్తున్న వార్తలు కొందరికి ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.
తేజ దర్శకత్వంలో ‘అలివేలుమంగ వెంకటరమణ’ చిత్రంలో హీరోయిన్ పాత్రకు గాను కీర్తి సురేష్ను సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.
కాని ఆ విషయంలో నిజం లేకపోవచ్చు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె చేతిలో మూడు బిగ్గెస్ట్ చిత్రాలు ఉన్నాయి.ఇదే సమయంలో కమల్ హాసన్ నటించబోతున్న ఒక సీక్వెల్లో కూడా గౌతమ్ మీనన్ ఆమెను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.
మొత్తం నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి.అవి అన్ని కూడా సూపర్ స్టార్స్తో నటించేవి.అయితే ఇలాంటి సమయంలో తేజ దర్శకత్వంలో అది గోపీచంద్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుందా అంటే అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి అసలు విషయం ఏంటీ అనేది కీర్తి సురేష్ నుండి క్లారిటీ వస్తే కాని తెలియదు.నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయిన కీర్తి సురేష్ ఆ పాత్రను ఓకే చేసి ఉండొచ్చు అంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.