మహానటి చిత్రంతో సౌత్ ఇండియాతో పాటు ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ‘సఖి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.గుడ్ లక్ సఖి అనే విభిన్నమైన టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.లేడీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో కీలక పాత్రలో ఆది పినిశెట్టి మరియు జగపతిబాబు నటిస్తున్నారు.
నగేష్ కుకునూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు.ఆగస్టు 15వ తారీకున ఈ చిత్రం టీజర్ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అప్పటి వరకు థియేటర్లు ఓపెన్ అవ్వనున్నాయి కనుక ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తారని అంటున్నారు.