తెలుగు బాపు బొమ్మ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గురించి అందరికి తెలిసిందే.తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానుల మనసులను గెలుచుకుంది.
తను నటించే సినిమాలో తన పాత్ర ఎంతో హోమ్లీగా కనిపిస్తుంది.తను ఎంచుకునే పాత్రలు కూడా తనకు తగ్గట్టుగానే ఉన్నట్లు అనిపిస్తుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది.
బాలనటిగా మలయాళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.ఇక 2016 తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటించిన ఆమెకు గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం మహానటి సావిత్రి కథతో తెరకెక్కిన మహానటి సినిమాలో బాగా నటించింది.ఈ సినిమాతోనే కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు పొంది ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇక తమిళంలో అన్నాత్తే సినిమాలో కూడా నటిస్తుంది.మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.తాజాగా ఆమె మరో సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘గుడ్ లక్ సఖీ‘.ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించింది.ఈ సినిమా క్రీడల నేపథ్యంలో తెరకెక్కనుంది.సుధీర్ చంద్ర నిర్మాతగా వ్యవహరించారు.ఇందులో ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలు గా నటించారు.తెలుగు తో పాటు ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల చేయనున్నట్లు సినీ బృందం తెలిపారు.