సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కైనా కెరీర్ ను మలుచుకునే తీరుపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.అందం, అభినయం ఉన్న చాలామంది హీరోయిన్లకు సరైన అవకాశాలు రాకపోవడానికి కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే అసలు కారణం.
ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా అలాంటి తప్పే చేస్తేందని.కీర్తి చేయబోయే ఆ తప్పు వల్ల ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.కెరీర్ విషయంలో కీర్తి రాంగ్ స్టెప్ వేస్తోందని కీర్తి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం చిత్ర యూనిట్ సాయిపల్లవిని సంప్రదించగా ఆమె నటించడానికి ఇష్టపడలేదు.అయితే అదే పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ అంగీకరించినట్టు తెలుస్తోంది.
అయితే కీర్తి ఆ సినిమాలో నటిస్తే మాత్రం హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది.
మహేష్ బాబుతో కలిసి సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోల సరసన మరిన్ని అవకాశాలు వస్తాయి.
అయితే ఇలాంటి సమయంలో చెల్లి పాత్రలు పోషిస్తే ఆ సినిమా హిట్టైనా స్టార్ హీరోలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి మొగ్గు చూపరు.చిరంజీవికి చెల్లి పాత్రలో నటించినా ఆ పాత్ర వల్ల కీర్తికి పెద్దగా ప్రయోజనం చేకూరదు.
మరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ ఈ పాత్ర విషయంలో ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.వేదాళం రీమేక్ విషయంలో ఆమె తీసుకునే నిర్ణయంపైనే కీర్తి సురేష్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.