తన అవార్డును మహానటికి అంకితం ఇచ్చిన యువనటి

అలనాటి లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవితగాధను ‘మహానటి’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.అయితే ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నటించడం కాదు జీవించాలని ఏరి మరీ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్.

 Keerthy Suresh Dedicates Her National Award To Savithri-TeluguStop.com

ఎక్కువ సినిమాలు చేసిన అనుభవం లేని కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఎలా చేస్తుందో అనే భయం అందరిలోనూ ఏర్పడింది.

కట్ చేస్తే.

సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.సావిత్రి పాత్రలో పరకాయప్రవేశం చేసింది కీర్తి సురేష్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తారు ఆడియెన్స్.

సావిత్రి లాంటి మహానటి పాత్రలో నటించి తన జీవితాన్ని ధన్యం చేసుకుందంటూ పలువురు ప్రముఖులు ఆమెకు కితాబిచ్చారు.కాగా సావిత్రి బయోపిక్‌లో నటించి మెప్పించిన కీర్తి సురేష్‌కు జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించిన సంగతి తెలిసిందే.

తాజాగా దీనికి సంబంధించి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్, తనకు వచ్చిన ఈ అవార్డును మహానటి సావిత్రికి అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది.

తన యాక్టంగ్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రను తనతో చేయించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు రుణపడి ఉంటానని ఆమె పేర్కొంది.

ఇక సావిత్రి పాత్రలో నటించడానికి ముఖ్య కారకులైన తన తల్లి మేనకా సురేష్, మావయ్య గోవింద్‌లకు కీర్తి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube