టాలీవుడ్ దర్శకుడు తేజ డైరెక్ట్ చేసే సినిమాల్లో అన్ని అంశాలు పక్కాగా ఉండేలా చూసుకుంటాడు.ముఖ్యంగా నటీనటలు ఎంపిక విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఇందులో భాగంగా హీరోహీరోయిన్లను తేజ ఎంచుకునే విధానం కూడా ప్రేక్షకులు బాగా నచ్చుతుంది.అందుకే ఆయన తీసే సినిమాలను కనీసం ఒక్కసారైనా చూడాలని ప్రేక్షకులు కోరుతుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా తేజ తెరకెక్కించనున్న ఓ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా తేజ తెరకెక్కించనున్న తాజా చిత్రం ‘అలిమేలు మంగ వెంకటరమణ’ షూటింగ్ను త్వరలోనే ప్రారంభించాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై చాలా రోజులుగా సందిగ్ధత నెలకొంది.దర్శకుడు తేజ గత రెండు చిత్రాల్లో అందాల భామ కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా తీసుకున్నాడు.
ఇక తన నెక్ట్స్ మూవీలోనూ ఆమెను తీసుకోవాలని చూసినా, కొన్ని కారణాల వల్ల ఆమెను వద్దనుకున్నాడు.దీంతో టాలీవుడ్ స్వీటీ అనుష్కను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నాడు.
కానీ అనుష్క చాలా తక్కువగా సినిమాలు చేస్తుండటంతో ఆమెను కూడా వద్దని అనుకున్నాడు.దీంతో ప్రస్తుతం ఫేంలో ఉన్న కీర్తి సురేష్ అయితే ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని భావించిన తేజ, ఈ సినిమాలో ఆమెను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇక ఈ సినిమాతో తేజ డైరెక్షన్లో కీర్తి సురేష్ తొలిసారి నటించనుంది.మరి ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.