టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ మహానటి చిత్రంతో ఎలాంటి గుర్తింపును తెచ్చుకుందో అందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో జాతీయ గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
అయితే ఆమె తెలుగు సినిమాలకంటే ఎక్కువగా తమిళ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో తెలుగు జనాలు ఆమెను ఎక్కువగా పట్టించుకోవడం లేదు.
ఇక అక్కడ కూడా ఎక్కువ కమర్షియల్ చిత్రాలకంటే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కీర్తి సురేష్ మరో స్టార్ హీరోయిన్ బాటలో పయనిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్లో స్వీటీ అనుష్క శెట్టి కూడా అరుంధతి చిత్రం నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ దూసుకుపోతుంది.అయితే ఆమె ఎంచుకునే కథలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుండటంతో ఆమె ఇంకా స్టార్ హీరోయిన్లలో టాప్ పొజిషన్ను దక్కించుకుని దూసుకుపోతుంది.
కానీ కీర్తి సురేష్ పరిస్థితి వేరేగా ఉంది.ఆమె ఎంచుకునే కథలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించడం లేదు.
అటు కమర్షియల్ పరంగానూ ఈ సినిమాలు బోల్తా కొడుతున్నాయి.ఇటీవల ఈమె ముఖ్య పాత్రలో నటించిన పెంగ్విన్ దీంతో ఈ అమ్మడు ప్రస్తుతం మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది.
ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయితేనే అమ్మడికి టాలీవుడ్లో కెరీర్ ఉంటుందనేది వాస్తవం అని చిత్రల వర్గాలు అంటున్నాయి.