టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేటి మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరోసారి టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందులో బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకుమార్ తెలుగులో తెరకెక్కించే సినిమాలో ఆదికి జోడీగా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే దీంతో పాటు నితిన్ కి జోడీగా వెంకి కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
దీంతో ఈ ఏడాది కీర్తి సురేష్ తెలుగులో మళ్ళీ బిజీ అవుతుంది అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన్మధుడు సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నంటిస్తూ ఉండగా మరో కీలక పాత్రలో సమంత నటిస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కీర్తి సురేష్ కూడా భాగం అయ్యిందని తెలుస్తుంది.
సినిమాలలో కథని మలుపు తిప్పే పాత్రలో కీర్తి కనిపించబోతుంది అని తెలుస్తుంది.ఇక నాగార్జునతో చాలా క్లోజ్ గా ఉన్న కీర్తి సురేష్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన్మధుడులో కీర్తి నటిస్తుంది అనే మాట నిజమని తెలుస్తుంది.